రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర మూవీ రామ్ చరణ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా వల్లే రామ్ చరణ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హోదా సంపాదించుకున్నారు.అయితే ఈ సినిమాలో చేసే సమయంలో రామ్ చరణ్ కి గాయాలు అవ్వడం వల్ల అలా జరిగింది అంటూ అప్పటి జ్ఞాపకాలను మరోసారి నెమరు వేసుకున్నారు డాన్స్ కొరియోగ్రాఫర్ అయినటువంటి శివశంకర్ మాస్టర్ తనయుడు విజయ్. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మగధీర సినిమా సమయంలో మా నాన్న శివ శంకర్ మాస్టర్ దగ్గర నేను అసిస్టెంట్ గా చేశాను. ఆ సమయంలో రామోజీ ఫిలిం సిటీలో 15 రోజులపాటు ఒక సాంగ్ కంపోజ్ చేశాను. అదే టైం లో రామ్ చరణ్ గుర్రపు స్వారీ చేసే సమయంలో దెబ్బలు తాకడం వల్ల ఆ పాట షూటింగ్లో పాల్గొనలేదని చెప్పాడు.దాంతో కాజల్ నే ఎక్కువగా చూపించాల్సి వచ్చింది.

 అయితే ఈ డ్యాన్స్ కంపోజ్ అంతా చూసి రాజమౌళి ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడ్డాను. కానీ ఆ తర్వాత అసలు విషయం చెప్పడంతో నువ్వేమీ భయపడకు నేను మీ నాన్నకు చెబుతానులే అని రాజమౌళి నాకు ధైర్యం చెప్పారు.ఆ తర్వాత పాట కోసం ఏం కావాలో అది తీసుకొని మిగతాదంతా ఎడిట్ చేసిన సమయంలో నాన్న దగ్గరికి వచ్చి రాజమౌళి గారు నాకు రాంచరణ్ తో ఎక్కువ డ్యాన్స్ వద్దు..కేవలం కాజల్ తోనే ఎక్కువ డాన్స్ చేయించండి.ఈ పాటకి అదే ఎక్కువ అవసరం అని రాజమౌళి నాన్నతో చెప్పారు.దాంతో నాన్న కూడా దానికి ఓకే అని చెప్పారు.

కానీ అదే సమయంలో మా నాన్న రామ్ చరణ్ ని డాన్స్ ఎక్కువగా చేయించకుండా కేవలం కాజల్ తోనే ఎక్కువ డ్యాన్స్ చేయిస్తే చిరంజీవి ఏమంటారో అని భయపడ్డారు. కానీ ఈ విషయంలో రాజమౌళి గారు బాధ్యతలు తీసుకొని నేను చిరంజీవి గారికి సర్ది చెబుతాను అన్నట్లుగా మాట ఇచ్చి చిరంజీవికి ఈ పాట కోసం నాకు హీరో కాదు హీరోయిన్ డాన్స్ ఎక్కువగా ఉండాలి అని చెప్పారు. అలా మగధీర సినిమా షూటింగ్ సమయంలో చెర్రీకి గాయాలు అవ్వడం వల్ల పాట షూటింగ్ చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు పడ్డాం. అలాగే గ్రాఫిక్స్ ఎక్కువగా వాడకుండా చాలా కష్టపడింది అంటూ డాన్స్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ తనయుడు విజయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: