టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టాడు. ఇక కెరియర్ను మొదలు పెట్టిన కొత్తలో ఈయన వరుస పెట్టి భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ అత్యంత తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం పూరి జగన్నాథ్ భారీ స్థాయి విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోయాడు. ఈయనకు ఆఖరుగా ఇస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా మంచి విజయం దక్కింది.

ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన లైగర్ , డబల్ ఈస్మార్ట్ మూవీ లు వరుసగా ఘోర పరాజయాలను ఎదుర్కొన్నాయి. ఇలా వరుస పరాజయాల తర్వాత పూరి జగన్నాథ్ తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా ఓ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే వీరి కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ కి బెగ్గర్ అనే టైటిల్ ను మేకర్స్ అనుకుంటున్నాట్లు , అదే టైటిల్ ను ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసి మరికొన్ని రోజుల్లో అధికారికంగా ఈ మూవీ బృందం వారు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ను పూరి జగన్నాథ్ అత్యంత స్పీడ్ గా కంప్లీట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క షూటింగ్ను జూన్ నెలలో మొదలు పెట్టి కేవలం 60 రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి ఆ తర్వాత జెడ్ స్పీడ్ లో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసి ఈ మూవీ ని ఈ సంవత్సరం చివరి వరకు విడుదల చేయాలి అనే ఆలోచనలో పూరి జగన్నాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: