టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి పరిచయం అనవసరం. తాజాగా ఈ అందాల భామ సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేసింది. అందులో సామ్ బ్లాక్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో మెరిసింది. ఎయిర్ పోర్ట్ లో బ్లాక్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కనిపించింది. ప్రస్తుతం  ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ క్యూట్ సామ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ బ్యూటీ అత్తరింటికి దారేది, ఏం మాయ చేసావె, ఓ బేబీ, యశోద, రామయ్య వస్తావయ్యా, అఆ లాంటి మంచి మంచి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.  
 
ఇకపోతే సామ్ తన అందం, అభినేయంతో ఎంతమంది ప్రేక్షకుల మనసును దోచుకుంది. సమంత రూత్ ప్రభు నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అందాల భామ ఏ పోస్ట్ పెట్టిన సరే లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి. సమంతకి కేవలం టాలీవుడ్ లోనే కాదు, అటు బాలీవుడ్.. ఇటు కొలివుడ్ లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సామ్ అంటే ఇష్టపడని వారుండారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ భామ కోలీవుడ్ గోల్డెన్ క్వీన్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోస్ కూడా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు షేర్ చేసింది.


ఈ అందాల భామ గతంలో ఆరోగ్యం బాగలేక సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే సమంతా మళ్లీ సినిమాలలో కనిపిస్తుంది. ఈమె గతంలో అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకుంది. కొన్ని కారణాల వాళ్ల వీరిద్దరూ విడిపోయారు. ఇటీవలే నాగ చైతన్య, శోభితా ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకొని డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సామ్ ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో.. ఇప్పుడిప్పుడే సినిమాలలోకి వస్తుంది. ఇప్పుడు సమంత సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: