జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఆరేళ్ల నుంచి పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు. 2019 తర్వాత పవన్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు విడుదలయ్యాయి. అయితే జగన్ సర్కార్ టార్గెట్ చేయడంతో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ కలెక్షన్ల విషయంలో తీవ్రంగా నష్టపోయాయి. 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించే విషయంలో ఫెయిల్ అయ్యాయి.
 
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్నా పవన్ సినిమాలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. పవన్ ను తొక్కేయాలని కుట్ర చేస్తోందెవరు అని కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పవర్ స్టార్ సినిమాలకే ఎందుకిలా జరుగుతోందంటూ అనుమానాలను సైతం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. హరిహర వీరమల్లు విషయంలో నిజంగానే కుట్ర జరిగింది.
 
పవన్ ఇంత ఘాటుగా స్పందించారంటే ఆయన ఊరికే స్పందించరని ఇండస్ట్రీలోని వాళ్లకు సైతం తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగ, సినిమాల రేంజ్ తగ్గించేలా వ్యవహరించడం వల్ల బెనిఫిట్ పొందేదెవరు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ వ్యవహారాలపై మరింత దృష్టి పెట్టి డబుల్ గేమ్ ఆడుతున్న వాళ్లకు షాకిచ్చే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పవచ్చు.


భవిష్యత్తులో పవన్ సినిమాలు ఎవరికీ ఈ విధంగా టార్గెట్ కాకుండా మొదటి నుంచి అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సంచలన రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని అదే సమయంలో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న డైరెక్టర్లకు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే రాజకీయాల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ మరింత ఆనందించే ఛాన్స్ అయితే ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.





 


మరింత సమాచారం తెలుసుకోండి: