తెలుగులో అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన గొప్ప చిత్రాల్లో `గోరింటాకు` ఒకటి. ప్రతి రాఖీ పండుగకు టెలివిజన్ లో స్క్రీనింగ్ అయ్యే ఈ చిత్రం ఇటీవలే 17 ఏళ్ల ను పూర్తి చేసుకుంది. కన్నడంలో శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన `అన్న తంగి` అనే సినిమాకు గోరింటాకు తెలుగు రీమేక్‌. వి. ఆర్. ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రాజశేఖర్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించారు. మీరా జాస్మిన్ హీరోకి చెల్లెలుగా చేసింది. ఆకాశ్‌, హేమ, బెనర్జీ, బ్రహ్మాజీ, శివాజీ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.


సూపర్ గుడ్ ఫిల్మ్స్‌ బ్యానర్ ఆర్. బి. చౌదరి, పరాస్ జైన్ కలిసి నిర్మించిన గోరింటాకు మూవీ 2008 జూలై 4న రిలీజ్ అయింది. అంత‌క‌న్నా ముందు `ఎవడైతే నాకేంటి` వంటి మాస్ అండ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాతో రాజ‌శేఖ‌ర్ బిగ్ హిట్ అందుకుని ఉన్నారు. ఆ వెంట‌నే గోరింటాకు వంటి ప‌క్కా ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అయితే ట్రాజడీ ఎండింగ్ కార‌ణంగా మొద‌ట ఈ మూవీ ప్రేక్ష‌కుల‌కు పెద్దగా ఎక్క‌లేదు. ఫ‌స్ట్ వీక్ యావ‌రేజ్ కలెక్ష‌న్స్ రావ‌డంతో సినిమా డిజాస్ట‌ర్ అని అంతా అనుకున్నారు.


కానీ అటువంటి స‌మ‌యంలో ఓ కాంట్ర‌వ‌ర్సీ సినిమాను కాపాడింది. గోరింటాకు మూవీలోని ఒక సీన్ లో న‌టుడు ఆకాష్ `మీ అన్న చెబితే కుంటోడు, గుడ్డోడుని కూడా పెళ్లి చేసేసుకుంటావా?` అంటూ మీరా జాస్మిన్ తో ఓ డైలాగ్ చెబుతాడు. ఈ డైలాగ్ ర‌చ్చ‌కు తెర లేపింది. హ్యూమన్ రైట్స్ అధికారులు వెంట‌నే ఈ డైలాగ్ ను సినిమా నుంచి తొల‌గించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్స్ చేశారు. ఈ కాంట్ర‌వ‌ర్సీతో గోరింటాకు మూవీకి భారీ ప‌బ్లిసిటీ ఏర్ప‌డింది. ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ కు క్యూ కట్టారు. అలా సినిమా రెండో వారం నుంచి పుంజుకుని మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసర్స్ లో టాప్ 6 ప్లేస్ లో నిలిచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: