సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకి ఎలాంటి పాపులారిటీ ఉంది అనే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నిరంతరం ట్రెండ్ అవుతూ కొన్ని కొన్ని సార్లు ట్రోల్ అవుతూ .. సమంత పేరు ఎప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతూనే ఉంటుంది . రీసెంట్ గా సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అభిమాన్య్లకి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.  సమంత ఎన్నో సందర్భాలలో పలు పోస్టులు షేర్ చేసింది . అప్పుడు జనాలు ఎక్కువగా ట్రోల్ చేసేవారు . కానీ ఇప్పుడు సమంత చేసిన పోస్ట్ కి ఒక్కటంటే ఒక్క ట్రోలింగ్ కూడా రాకపోతు ఉండడం గమనార్హం.

అంతలా ఆమె పెట్టిన పోస్ట్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. కోటా శ్రీనివాసరావు మరణించిన విషయం అందరికీ తెలిసిందే . ఆయన మరణ వార్త తెలిసి ప్రముఖులు హుటాహుటిన హైదరాబాద్లోని ఫిలిం నగర్ లోని ఆయన నివాసానికి తరలివస్తున్నారు . నేడు సాయంత్రం మూడు గంటల 30 నిమిషాలకు ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి . కోట శ్రీనివాసరావు మన మధ్య లేరు అన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు . పలువురు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఇండస్ట్రీకి ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది అంటూ పలువురు స్టార్స్ చెప్పుకొస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే  హీరోయిన్ సమంత కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు . కోటా శ్రీనివాసరావు ఫోటోని షేర్ చేస్తూ "మీ ప్లేస్ ఇండస్ట్రీలో ఎవరు భర్తీ చేయలేనిది " అంటూ క్యాప్షన్ రాస్తూ దండం పెడుతున్న ఎమోజిని జోడించారు . సమంతకి కోటా శ్రీనివాసరావు తో ఉన్న స్పెషల్ బాండింగ్ అందరూ గుర్తు చేసుకుంటున్నారు . బృందావనం సినిమాలో అదే విధంగా మరికొన్ని సినిమాలలో కోట శ్రీనివాసరావు తో స్క్రీన్ షాట్ చేసుకునింది సమంత . హీరోయిన్ సమంత పెట్టిన పోస్ట్ ఇప్పూదు వైరల్ గా మారింది..!!
 


మరింత సమాచారం తెలుసుకోండి: