
కెరియర్ లోనే ఫస్ట్ టైం యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ తో అఖిల్ జనాలని పలకరించబోతున్నారు . ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను అనుకున్నారు మూవీ మేకర్స్. ఆమె పై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారు . అయితే కొన్ని కారణాల చేత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది . ఆమె ప్లేస్ లోకి యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ని చూస్ చేసుకున్నారు మ్నూవీ మేకర్స్ అంటూ ఓ న్యూస్ బాగా గట్టిగా వినిపించింది. ఆల్ మోస్ట్ ఆల్ ఆమె సెలెక్ట్ అయినట్లు టాక్ వినిపించింది .
మరి కొద్ది రోజుల్లో ఆమె సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వబోతుంది అనగా ఆమె కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఓ న్యూస్ తెలుగు ఫిలిం సర్కిల్స్ ట్రెండ్ అవుతుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఆమె ప్లేస్ లోకి వేరే హీరోయిన్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట మూవీ మేకర్స్. అయితే ఒకరి తర్వాత ఒకరు ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారు అనే విషయంపై క్లారిటీ రాలేదు . దీనిపై చిత్ర బృందం ఇంకా ఏ విధంగా స్పందించలేదు . ఇది నిజంగానే నిజమా..? హీరోయిన్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారా..? లేదా ఫేక్ వార్తనా..? తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సిందే . లేకపోతే సినిమాకి భారీ నష్టం తప్పదు . కానీ అఖిల్ అక్కినేని ఈ సినిమాతో ఇరగదీస్తాడు అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . రిలీజ్ అయిన పోస్టర్స్ అలా ఉన్నాయి . మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అక్కినేని అఖిల్ ఈ సినిమాతో హిట్ కొట్టబోతున్నాడు . అది మాత్రం ఖాయం అంటూ ఫ్యాన్స్ 100 కి 100% నమ్మేస్తున్నారు..!