జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఉన్న ఇష్టం, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన సినిమాలు, ఆయన డాన్స్ స్టెప్స్, ఆయన యాక్షన్ సీన్స్ అన్నీ అభిమానులను ఎప్పుడూ ఉర్రూతలూగిస్తూనే ఉంటాయి. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో సెకన్ల వ్యవధిలో వైరల్ అవుతుందంటే అతడి పాపులారిటీకి అదే నిదర్శనం. అలాంటి ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన ఒక పాట ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎంతో మంది టాప్ హీరోయిన్స్‌తో, స్టార్ బ్యూటీస్‌తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అనేక చార్ట్‌బస్టర్ సాంగ్స్‌లో, ఫ్యాన్స్ మైండ్‌లో ఎప్పటికీ నిలిచిపోయే డాన్స్ నంబర్స్‌లో ఆయన తళుక్కుమన్నారు. కానీ అందులో ఒక ప్రత్యేకమైన పాట, ఒక ప్రత్యేకమైన జోడీ ఎప్పటికీ ప్రత్యేక స్థానంలో నిలుస్తుంది. ఆ జోడీ మరెవరో కాదు – తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి సతీమణి, ప్రఖ్యాత నటి రమ్యకృష్ణ.


జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నా అల్లుడు’ సినిమాలో రమ్యకృష్ణ అత్తగారి పాత్రలో కనిపించి, అల్లుడు పాత్రలో ఎన్టీఆర్ స్క్రీన్‌పై అదరగొట్టే ఎంటర్టైన్‌మెంట్ అందించారు. కానీ ఈ జోడీని స్క్రీన్‌పై మరో లెవెల్‌కి తీసుకెళ్లింది ‘సింహాద్రి’ సినిమా. ఈ సినిమాలో రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్‌లో ఎన్టీఆర్‌తో కలిసి చిందులు వేసింది అందరి మదిలో ఇప్పటికీ ఈ సినిమా కొత్తగానే ఉంది. ఆ సమయంలో రమ్యకృష్ణ వంటి సీనియర్ హీరోయిన్‌తో ఎన్టీఆర్ స్క్రీన్‌పై జోడి కట్టడమే కాదు, ఆ పాటలో ఇరువురి ఎనర్జీ, డాన్స్ స్టెప్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. రమ్యకృష్ణ తన స్టైల్, గ్రేస్‌తో స్క్రీన్‌పై గ్లామర్‌ని నింపగా, ఎన్టీఆర్ తన ఎనర్జీ, మాస్ అటిట్యూడ్‌తో పాటకు వేరే లెవెల్ ఇచ్చాడు. ఆ పాటలో ఇరువురి కాంబినేషన్ అద్భుతంగా పనిచేసింది. ఫలితంగా, ఆ స్పెషల్ సాంగ్ ఆ టైమ్‌లోనే కాకుండా ఇప్పటికీ యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది.



పాట ప్రదర్శనలో, రమ్యకృష్ణ వేసిన స్టెప్స్, ఎన్టీఆర్ వేసిన మాస్ మూమెంట్స్ కుర్రాళ్ల గుండెల్లో ఎప్పటికీ ముద్ర వేసాయి. ఈ పాట లేకుండా ఏవైనా ఫంక్షన్లు, ఈవెంట్లు, డీజే ప్రోగ్రామ్స్ జరగవు అని చెప్పుకోవచ్చు. ప్రతి వేడుకలో ఈ పాటకు వచ్చే రెస్పాన్స్ చూస్తే ఎన్టీఆర్ పాపులారిటీని ఊహించవచ్చు. ఇప్పటికీ ఈ పాటను అభిమానులు సోషల్ మీడియాలో పదేపదే షేర్ చేస్తూ, “చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు బ్రో!” అంటూ కామెంట్లు పెడుతున్నారు. రమ్యకృష్ణ ఎనర్జీ, ఎన్టీఆర్ మాస్ వైబ్స్ కలిసిన ఈ పాట ఒక తరానికి మాత్రమే కాకుండా తరాల తరబడి గుర్తుండిపోయేలా చేసిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు..!



మరింత సమాచారం తెలుసుకోండి: