ఓజీ సినిమా రిలీజ్ అయినా మూడు రోజులు అవుతున్నప్పటికి, బాక్స్ ఆఫీస్ వద్ద "ఓజీ ఫీవర్" ఎక్కడా తగ్గలేదు. ప్రతి చోటా థియేటర్స్ పూర్తిగా హౌస్ఫుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా, ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చూపనట్టు చేసిన క్యారెక్టర్ ప్రేక్షకులకు అత్యంత ఆకట్టుకునే హైలైట్ గా మారింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, పవన్ కళ్యాణ్ ప్రతి సన్నివేశంలో తన మేనేజర్ కి డబుల్ కాదూ, ట్రిపుల్ షాకులు ఇస్తూ, తన శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని చాటాడు.ఈ సినిమాలో ఫస్ట్ హీరోగా పవన్ కళ్యాణ్ ఉంటే, రెండవ హీరో తమన్, మూడవ హీరో సుజిత్. అందరు రివ్యూస్ ఇచ్చి, సినిమాపై ప్రత్యేకంగా ప్రశంసలు వ్యక్తం చేశారు.
 

సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో ఓజీ సినిమా గురించి ఉన్న టాక్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా, ప్రేక్షకులు ఆ సీన్స్ గురించి చర్చిస్తూనే ఉన్నారు.  ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు వింటేజ్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ అయ్యాడు అంటూ ఆనందం తో సంబరాలు చేసుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ ఓజీ సినిమాలో ఎవ్వరూ గమనించని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి అనే విషయం బయటపడ్డింది. ఇక మరో పెద్ద హైలైట్, ఈ సినిమాలో ఒక మెగా హీరో గెస్ట్ అపీరియన్స్ లో కనిపించటం బిగ్ విశేషం.  సోషల్ మీడియాలో ఇప్పుడు అది వైరల్ అవుతోంది. రామ్ చరణ్ - సుభాష్ చంద్రబోస్ గెటప్ లో ఒక సన్నివేశంలో కనిపించాడు.

 

కొంతమంది ప్రేక్షకులు ఆ సన్నివేశాన్ని గమనించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, "సుజిత్ ఇలా ఊహించారని ఊహించలేదు" అని చెప్పుతున్నారు. అంతేకాదు, అభిమానులు మాట్లాడుకుంటూ "ఓజీ పార్ట్ 2 లో రామ్ చరణ్ కూడా ఉండవచ్చు" కాబట్టి, ముందుగానే ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు సుజిత్ అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటో, వీడియోలు, డిస్కషన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు అన్ని అనుకున్నట్లే అయితే ఓజి 1 కంటే ఓజీ 2 ఇంకా హిట్ అవుతుంది..ఖచ్చ్గితంగా రామ్ చరణ్ ఈ సినిమాలో ఉంటే అని మాట్లాడుకుంటున్నారు. "ఇలా, ఓజీ సినిమా తాజాగా ప్రేక్షకుల, ఫ్యాన్స్ హృదయాల్లో నిలిచిపోతుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ..???

మరింత సమాచారం తెలుసుకోండి: