ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం రాజా సాబ్ . ప్రస్తుతం ఈ సినిమా భారీ అంచనాలను రేపుతోంది. ఈ సినిమా పూర్తిగా హారర్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటుండటం ప్రత్యేకత. ప్రభాస్ ఇప్పటివరకు ఈ తరహా జానర్‌లో కనిపించకపోవడంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, నిన్ననే రిలీజ్ చేసిన ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ట్రైలర్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపి, ప్రభాస్‌ని ఒక కొత్త కోణంలో చూపించారు. ముఖ్యంగా కామెడీ యాంగిల్‌లో ప్రభాస్ కనిపించడం అభిమానులకు ఊహించని సర్ప్రైజ్‌గా మారింది.

అయితే, ఒక చిన్న ట్విస్ట్ మాత్రం ఉంది. రాజా సాబ్ సినిమా అన్ని భాషల్లో ఒకేసారి జనవరి 9న రిలీజ్ అవుతున్నప్పటికీ, తమిళనాడులో మాత్రం ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ కానుంది. దానికి కారణం, అదే రోజున తమిళ సినీ ఇండస్ట్రీలో హీరో విజయ్ దళపతి నటించిన "జననాయగబ్" సినిమా కూడా విడుదల కావడం. విజయ్ దళపతి చివరి చిత్రం కావడంతో కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్‌లో ప్రభాస్ సినిమా ఒకేసారి విడుదలైతే పిక్ క్లాష్ తప్పదని మేకర్స్ అర్థం చేసుకున్నారు.

దీంతో నిర్మాత దిల్ రాజు స్మార్ట్ డిసిషన్ తీసుకున్నారు. ఆ కాంపీటీషన్ తప్పించుకోవడమే కాకుండా, రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి రన్ సాధించాలని ఉద్దేశ్యంతో రాజా సాబ్‌ను తమిళనాడులో జనవరి 10న రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ నిర్ణయాన్ని అభిమానులు కూడా పాజిటివ్‌గా స్వీకరిస్తున్నారు.ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ప్రభాస్‌ను ఫుల్ ఎంటర్‌టైనింగ్ కామెడీ రోల్‌లో చూపించడమే ఈ చిత్రానికి హైలైట్‌గా మారనుంది. ట్రైలర్‌ చూసినవారు ఇప్పటికే "ఈసారి ప్రభాస్ ఒక కొత్త వైపు చూపించబోతున్నాడు" అంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. మొత్తానికి, రాజా సాబ్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జనవరి 9న (తమిళనాడులో జనవరి 10న) థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందా? అన్నది చూడాలి..!!


మరింత సమాచారం తెలుసుకోండి: