
బాలయ్య పక్కన నటించాలంటే హీరోయిన్లకు ప్రత్యేకమైన ప్రెజెన్స్ అవసరం — కేవలం గ్లామర్ సరిపోదు, కొంచెం ఘనంగా, ఒంటినిండా, ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. ఆ రేంజ్ లో స్క్రీన్ మీద నిలబడగలిగే నటి అంటే ఐశ్వర్య రాజేష్ తప్ప మరెవరూ కాదు అని అభిమానులు అంటున్నారు. గతంలో నయనతార, శ్రియా వంటి హీరోయిన్లు బాలయ్యతో జోడీ కట్టారు. కానీ నయనతార ప్రస్తుతం రెమ్యూనరేషన్ పరంగా చాలా హై రేంజ్ లో ఉండటంతో, ఈసారి కొత్తగా కానీ ప్రతిభ ఉన్న నటి కావాలని మేకర్స్ భావించారట. అందుకే కంటెంట్కి ప్రాధాన్యం ఇచ్చే, పాత్ర బలంగా ఉంటేనే అంగీకరించే ఐశ్వర్య రాజేష్ ను సంప్రదించారట.
వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, కథ విన్న వెంటనే ఐశ్వర్య రాజేష్ ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. “పాత్రకు డెప్త్ ఉంటేనే నేను సినిమా చేస్తాను, కేవలం స్క్రీన్ టైమ్ కోసం కాదు” అనేది ఆమె నిబంధన. ఈ సారి కూడా అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ తోనే ఆమె బాలయ్య పక్కన కనిపించబోతోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక సోషల్ మీడియాలో అయితే ఈ న్యూస్ ఓ బాంబులా పేలిపోయింది. “బాలయ్య – ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ అంటే ఫైర్ అండ్ క్లాస్ కలయిక” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కొందరు అయితే ఈ కాంబో చూడటానికి చాలా ఎగ్జైట్ అయి, “ఇది బ్లాక్బస్టర్ ఫిక్స్” అని ముందే సెలబ్రేట్ చేస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కంటెంట్ బేస్డ్ సినిమాలే. ఇప్పుడు బాలయ్య లాంటి మాస్ స్టార్ తో కలిసి నటించబోతోంది అంటే అది ఆమె కెరీర్ లో మరో పెద్ద మైలురాయి అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి, ఈ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటి నుంచే ఆకాశాన్ని తాకుతున్నాయి.