టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో విడుదలైన చిత్రం రాజా సాబ్. జనవరి 9వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మొదటిరోజు, ప్రీమియర్స్ షోలు కలిపి రూ. 112 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల కాలంలో ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలలో తక్కువ వచ్చిన సినిమా ఇదే. ముఖ్యంగా తెలంగాణలో ప్రీమియర్స్ పడకపోవడంతో పాటుగా బాలీవుడ్ లో కూడా నెగిటివ్ రివ్యూలు రావడంతో ఓపెనింగ్స్ పైన కలెక్షన్స్ దెబ్బ పడినట్లు తెలుస్తోంది.


సోషల్ మీడియాలో మాత్రం మేకర్స్ స్పందిస్తూ హర్రర్ ఫాంటసీ జోనర్లో ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేశామని.. ఫస్ట్ డే వరల్డ్ వైజ్ గా రూ.112 కోట్లకు పైగా రాబట్టిందని ఈ జోనర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమా ఇదే అంటూ కూడా ప్రకటించారు. అయితే రెండవ రోజు తెలుగు వర్షన్ ఆక్యుపెన్సి  44%  నమోదయింది. ఇక హిందీ వర్షన్ లో మాత్రం 12.95% నమోదయింది. తమిళ వర్షన్ లో  21.11%  నమోదయ్యింది. అన్నీ కలిపితే మొత్తం మీద రూ.40 కోట్ల గ్రాస్ వసూలు వచ్చినట్లుగా సమాచారం. రాజా సాబ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల రూపాయల వరకు రెండు రోజులలో గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ విషయం పైన చిత్ర బృందం ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు.


ఇంత తక్కువలో కలెక్షన్స్  రాబడితే మాత్రం చిత్ర బృందం అంచనాలు అందుకోలేదని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. రాజా సాబ్ సినిమా రూ .200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా కనీసం రూ.400 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది. అంతేకాకుండా సంక్రాంతికి చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలకు కొంచెం మంచి టాక్ వచ్చిన ఖచ్చితంగా ఆ సినిమాల ఎఫెక్ట్ రాజా సాబ్ సినిమా మీద పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: