బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన రణవీర్ సింగ్ గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం దురంధర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.1300 కోట్ల రూపాయలు రాబట్టింది. కేవలం ఈ సినిమా హిందీలో మాత్రమే విడుదలై ఇలాంటి కలెక్షన్స్ రాబట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటిలో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దీంతో దురంధర్ 2 సినిమా మార్చి 19వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇటువంటి సందర్భంలోనే రణవీర్ సింగ్ కు బెదిరింపు మెసేజ్ వచ్చినట్లుగా తెలుస్తోంది.


పూర్తి వివరాల్లోకి వెళితే కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తూ రణవీర్ సింగ్ వాట్సాప్ కి కొంత మంది గుర్తు తెలియని దుండగులు వాయిస్ నోట్ పంపించారు. ఈ విషయం పైన రణవీర్ ముంబై పోలీసులను కూడా ఆశ్రయించారు. ఆ వెంటనే ముంబై పోలీసులు ఆయన నివాసం వద్ద భద్రతను కూడా పెంచారు. హీరోని బెదిరించిన వారు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నట్లుగా తెలియజేశారు. దీంతో ఈ విషయం పైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.


రణవీర్ సింగ్, దీపికా పదుకొనే ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయడంతో దీంతో పోలీస్ సిబ్బంది , ప్రైవేట్ బాడీ గార్డులు ఎక్కువగా మోహరించడంతో  వారి చేతిలో ఉన్న ఆయుధాలను చూసి సొసైటీ యాజమాన్యం పోలీసులకు ఒక లేఖ ద్వారా వివరణ ఇవ్వాలంటూ రాసింది. బాడీగార్డ్స్ చేతిలో ఆయుధాలు ఉన్నందువల్ల చాలామంది నివాసితులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలియజేశారు. మరి ఈ విషయం పైన రణవీర్ సింగ్ దంపతులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. డైరెక్టర్ ఆదిత్య ధర్ దురంధర్ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో రణవీర్ సింగ్ స్పై ఏజెంట్ గా కనిపిస్తారు. ఈ సినిమా సీక్వెల్ విడుదల కాబోతున్న సందర్భంలో ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: