తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అలనాటి హీరోయిన్ ప్రత్యూష గురించి చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. అలాంటి ప్రత్యూష చిన్న వయసులోనే హత్యకు గురవ్వడంతో ఇప్పటికీ ఆమె అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కేసులో పోలీసు విచారణ పైన ఎన్నో అభ్యంతరాలు, ఆరోపణలు కూడా ఇప్పటికీ వెలువెత్తుతున్నాయి. ప్రత్యూష హత్య కేసులో అప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రుల కుమారుల హస్తం కూడా ఉన్నట్లు పలు రకాల ఆరోపణలు వినిపించాయి. దీంతో ఈ కేసును సిబిఐకి అప్పగించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.


2002లో ఈ హత్య జరగగా ఈ కేసును విచారించిన సిబిఐ అనంతరం ఇందులో ప్రత్యూష స్నేహితుడు సిద్ధార్థ రెడ్డిని సిబిఐ నిందితుడిగా వెల్లడించింది. దీంతో ఈ కేసు పైన విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ఇతడికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించింది. అయితే ప్రత్యూష కుటుంబం మాత్రం ఇలాంటి పని చేసిన వారికి ఏడేళ్లు జైలు శిక్ష సరిపోదు అంటూ కుటుంబ సభ్యులు హైకోర్టుని ఆశ్రయించారు. తమ కూతురు ప్రత్యూషను చాలా క్రూరంగా అత్యాచారం చేశారని తల్లి సరోజిని ఆరోపణలు చేసింది.


అలా 2006లో హైకోర్టుని ఆశ్రయించగా, 2011 వరకు ఈ కేసు విచారణ జరిపిన కోర్టు సిద్ధార్థ రెడ్డికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లేవని, అతని జైలు శిక్షను రెండున్నర ఏళ్లకు తగ్గించింది. అనంతరం 2011లో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రత్యూష కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపైన సుప్రీంకోర్టు విచారణ జరపడం మొదలు పెట్టింది. అలా అప్పటినుంచి సుమారుగా 14 ఏళ్లపాటు సుప్రీంకోర్టులోనే ఈ విచారణ కొనసాగుతూ ఉంది. ఎట్టకేలకు ఈ రోజున తుది తీర్పు రానుంది. మరి ఈ కేసులో నిందితుడుగా ఉన్న సిద్ధార్థ రెడ్డికి శిక్ష పడుతుందా లేదా అని ఆటు అభిమానులు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఏం జరుగుతుందో మరో కొన్ని గంటలలో తెలియనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: