కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సప్తమి గౌడ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు విషయాల పైన స్పందిస్తుంటుంది. అయితే తాజాగా సినిమా వేడుకలలో ఫోటోగ్రాఫర్లు కెమెరామెన్ల తీరు పైన ఫైర్ అయ్యింది. మహిళా నటులను అసభ్యకరమైన కోణాలలో చిత్రీకరించడం పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది. పబ్లిక్ ఈవెంట్లో ఫిమేల్ యాక్టర్స్ కనిపిస్తే చాలు, వారి నటన కంటే వారి శరీర భాగాలపైన కెమెరాలు జూమ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది.


మేము ఇక్కడ ఉన్నది మా కళ కోసం ,సినిమా కోసం మాత్రమే కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అసభ్యకరమైన యాంగిల్స్ నుంచి ఫోటోలు తీసి మమ్మల్ని చాలా కించపరిచేలా చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదు ఒక వ్యక్తి గౌరవానికి సంబంధించిన విషయం. ఈవెంట్లను కవర్ చేసేవారు వృత్తి నైపుణ్యాన్ని కనీస మర్యాదను పాటించాలంటూ తెలియజేసింది. ఇలాంటి పనులు చేస్తే అసలు మేము సహించము. ఈ విషయంలో మహిళ నటులమంతా కూడా ఐక్యంగానే ఉన్నామంటూ రాసుకుంది.


ఈ అసభ్యకరమైన ధోరణిని ఇకమీదట సాధారణ విషయంగా చూడకూడదని , యాక్టర్స్ నాట్ ఆబ్జెక్ట్స్ (మేము నటులం.. వస్తువులం కాదు) అనే క్యాప్షన్ తో తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీని పంచుకుంది. దీంతో మీడియా మిత్రులు జర్నలిస్టులు కూడా తమకు మద్దతుగా నిలవాలని తెలియజేసింది. గతంలో కూడా జాన్వీ కపూర్, నోరా ఫతేహి మరి కొంతమంది హీరోయిన్స్ జూమ్ ఇన్ సంస్కృతి పైన ఫిర్యాదు కూడా చేశారు ఇప్పుడు సప్తమిక కూడా ఈ అంశాన్ని మరొకసారి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యింది. మరి ఈ విషయం పైన నేటిజన్ సైతం మద్దతు పలుకుతున్నారు. ఇలాంటివి జరగకుండా సినీ పరిశ్రమ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: