ఈ వివాహ వేడుకను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించారు. వివాహ కార్యక్రమం సంప్రదాయ పద్ధతిలో జరిగింది. అనంతరం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి సినీ ప్రముఖులు, స్నేహితులు, కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో కొత్త దంపతులను పలువురు ప్రముఖులు ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తుంది.
ఇక ఈ వార్తలో మరింత ఆసక్తికరంగా మారిన అంశం ఏమిటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్లి ఈ జంటను అభినందించారు. సీఎం స్వయంగా వారి నివాసానికి వెళ్లి కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తండ్రితో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెటిజన్ల మధ్య వేగంగా షేర్ అవుతున్నాయి. ఈ పరిణామం సోషల్ మీడియాలో మరో పెద్ద చర్చకు దారి తీసింది.కొంతమంది నెటిజన్లు దీనిని సానుకూలంగా తీసుకుంటూ, సినిమా రంగానికి చెందిన ప్రముఖులను అభినందించడం సహజమే అని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు మరికొందరు మాత్రం దీనిపై విమర్శలు కూడా చేస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఒక సినిమా హీరో, హీరోయిన్ ఇంటికి వెళ్లి అభినందించడం అవసరమా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు.
విజయ్ దేవరకొండ లేదా రష్మిక మందన్నలకు ప్రత్యక్షంగా రాజకీయ నేపథ్యం లేకపోయినా, సీఎం వెళ్లి అభినందించడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అనే సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం మర్యాదపూర్వక సందర్శనా? లేక దాని వెనుక మరేదైనా రాజకీయ లేదా సామాజిక ఉద్దేశ్యం ఉందా అనే కోణంలో కూడా చర్చలు కొనసాగుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి