ఈ మద్య ఒక్క ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా మాత్రమే పది కోట్లు వసూళ్లు చేయగలిగింది. ఈ నేపథ్యంలో రిలీజ్ అయిన ‘హ్యాపీ వెడ్డింగ్’ రిలీజ్ అయ్యింది.
ప్రోమోలు బాగుండడం, నిహారిక కథానాయిక కావడం, యూవీ క్రియేషన్స్ భాగస్వామ్యం ఉండడంతో ఈ సినిమాపై ఫోకస్ పడింది. అయితే ఈ సినిమాపై వచ్చిన అంచనాలు పెద్దగా ఫలితాన్ని అందుకోలేక పోయింది. నిహారిక కోసమైనా ఓపెనింగ్స్ రాలేదు. అయితే.. ‘హ్యాపీ వెడ్డింగ్’ మాత్రం సోమ్ములు చేసేసుకుంది. డిజిటల్, శాటిలైట్ రూపంలో దాదాపుగా రూ.3 కోట్లు వచ్చాయని సమాచారం.
వాస్తవానికి టాలీవుడ్ లో మహానటి సినిమా తర్వాత ఆ తరహా హిట్ సినిమా ఇప్పటి వరకు పడలేదు. ఆ స్థాయిలో కలెక్షన్లు కూడా ఏ సినిమా రాబట్టలేదు. అంతేకు ముందు రంగస్థలం, భరత్ అనే నేను రెండు సినిమాలు రెండు వందల క్లబ్ లో చేరాయి. ఆ తర్వాత మహానటి ముప్పయి కోట్ల వరకు చేరింది. కాగా, ప్రమోషన్లలో కలసి రూ.3 కోట్ల వరకూ బడ్జెట్ అయ్యిందని ఆ లెక్కన చూస్తే.. `హ్యాపీ వెడ్డింగ్` ఒడ్డున పడిపోయిందని ఇన్సైడ్ వర్గాల టాక్.
ఈ సినిమా కోసం స్టార్ హీరో రాంచరణ్ ప్రమోషన్ చేశారు. ఎమ్మెస్ రాజు కూడా యూవీ క్రియేషన్స్ అండ దండ కోరుకున్నది కూడా ఇందుకే. ఈ సినిమా వాళ్ల చేతుల్లో పడిన తరవాతే.. శాటిలైట్, డిజిటల్ హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం. ఈ సినిమా ఫ్లాప్ అయినా.. నిర్మాతలు మాత్రం హ్యాపీగానే ఉన్నారు.