బుల్లి తెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ చివరి దశకు చేరుకోవడంతో ప్రతి ఎపిసోడ్ నుండి ఎంతో థ్రిల్లింగ్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రేక్షకులు. కానీ అందుకు భిన్నంగా సండిగా..నీరసంగా సాగిపోతుంది. గత వారం రోజులుగా ‘టిక్కెట్ టు ఫినాలే’, ‘లగ్జరీ బడ్జెట్’ టాస్క్లు పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. ఆదివారం నాడు సాదాసీదాగా సాగింది. కాకపోతే..కమెడియన్లు సునీల్, నరేశ్లు సినిమా ప్రమోషన్లో భాగంగా హౌస్ లోకి వచ్చారు. ఇంటి సభ్యులతో ముచ్చట్లాడారు. సినిమా గురించి చర్చించారు. అందులో భాగంగా కంటెస్టెంట్లతో కలిసి గేమ్ ఆడారు.
ఈ టాస్క్ ప్రకారం రూ.500 కోట్ల ఆస్తి కోసం చిన్నోడు నరేష్, పెద్దోడు సునీల్లు రెండు టీంలుగా ఏర్పడి.. ఫైనల్గా వాదోపవాదాల అనంతరం ఈ ఆస్తిని చేజిక్కించుకోవాలని నాని టాస్క్ ఇస్తూ.. ఆయన పెదరాయుడు అవతారం ఎత్తారు. దీనికోసం నరేష్ టీంలో గీతా మాధురి, దీప్తి, శ్యామల, సామ్రాట్లు ఉండగా.. సునీల్ టీంలో తనీష్, కౌశల్, అమిత్, రోల్ రైడాలు ఉన్నారు.
ఇక వీరి మద్య సాగిన మాటల యుద్దం పరమ బోరింగ్ గా ఉంది..భారీ డైలాగ్లు చెప్పడం లాంటి సిల్లీ సిల్లీ టాస్క్లు ఉండటంతో బిగ్ బాస్ ‘సిల్లీ ఫెలోస్’ సైతం వీరలెవల్లో రెచ్చిపోయారు.
సునీల్, నరేష్ లు గుమ్మడి కాయని రెండు ముక్కలు పగల గొట్టడం...ఈ టాస్క్ ముగిసింది. చివరికి పెదరాయుడు నాని తీర్పు ఇవ్వాలి కాబట్టి.. బాగా ఆలోచించుతున్నట్టు నటించి ఆస్తిలో సగం పెద్దోడికి.. సగం చిన్నోడికి అంటూ తేల్చేశారు.