గత రెండు వారాలు స్వీట్ గా మాట్లాడిన నాగార్జున కొంతమంది హౌస్ మేట్స్ హద్దులు దాటడంతో ఒక్కసారిగా గరం అయ్యాడు. ఒకరి తరువాత ఒకరికి ఒక రేంజ్ లో క్లాస్ పీకేశారు. ముందుగా అందరూ అనుకున్నట్లు గాని ఎక్కువ డోస్ తమన్నాకు పడింది. తను శివ జ్యోతీ తో జర్నలిజం అన్నదే ఒక నటన అన్న విషయాన్ని నాగ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆమె చేత శివ జ్యోతి తో పాటు మిగతా అందరి జర్నలిస్టులకి క్షమాపణలు చెప్పించారు. తర్వాత తనను నామినేట్ చేసిన నా రవి క్రిష్ణ ను వెంటపడి వ్యక్తిగతంగా దూషించడం అసలు ఏం బాలేదని మండిపడ్డారు. 


ఆమె జర్నలిజాన్ని కించపరిచిన వీడియోని ప్లే చేయగా తమన్నా ముసిముసి గా నవ్వుతూ కనిపించింది. దీంతో నాకు కోపం తారాస్థాయికి చేరగా ఆమె తాను నమ్మడం లేదని సిగ్గుపడుతున్నానని చెప్పి కవర్ చేసింది. ఇకపోతే అలి రేజా హిమాజ పైన గట్టి గట్టిగా అరవడం కూడా నాకు సహించలేదు. ఆడపిల్లతో అలా మాట్లాడటం సబబు కాదని ఆయన హితవు పలికాడు. అలీ-హిమజ మధ్య జరిగిన గొడవను ప్రస్తావిస్తూ నాగార్జున అలీ చేత 21 గుంజీలు తీయించాడు. ఇంకా అంత పెద్ద గొడవ జరుగుతుంటే వారికి మధ్య సర్ది చెప్పడానికి ఎవరూ రాకపోవడం తో హౌస్ మెట్స్ కి కూడా ఒక క్లాస్ పీకాడు.


నాగ్ లో వచ్చిన ఈ సడన్ చేంజ్ కు ఆశ్చర్యపోయేలోపే వితిక కార్చిన దొంగ కన్నీళ్ళ గురించి ప్రస్తావించారు. అదే విషయం లో రవి చేత గ్లాస్ బాక్స్ బద్దలు కొట్టించిన శ్రీముఖి ని ఉద్దేశించి రవి 'ఫాల్తు ఐడియాలు… ఫాల్తు మోహంది' అన్నందుకు ఇంకొకసారి హౌస్ లో అలాంటి మాటలు మాట్లాడితే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. అలా అందరికీ కావల్సినంత కోటింగ్ ఇచ్చిన నాగార్జున… హౌస్ మేట్స్ కి క్లాస్ తీసుకున్నాక నాగ్ వారితో సరదాగా ఓ గేమ్ ఆడించారు. గేమ్ అయిపోయాక బాబా భాస్కర్ - రాహుల్ - పునర్నవి - వితిక - తమన్నాలలో ఎవరు రేపు ఎలిమినేట్ అవుతారనేది ఆదివారం చూద్దామని కనీసం ఎవరు సేవ్ అయ్యారు అని కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. అయితే ఇప్పటికే తమన్నా ఎలిమినేట్ అయిపోయింది అన్న వార్తలు బయటకి వచ్చేశాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: