టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్కు గాయాలు అయ్యాయి. 'వెంకీ మామ' చిత్రంలో ఓ పాటను చిత్రీకరిస్తుండగా వెంకటేష్ స్వల్పంగా గాయపడ్డారు. బాబీ దర్శకత్వంలో తెరెక్కుతున్నఈ చిత్రంలో ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా వెంకీ కాలు బెణికింది. దాంతో వెంటనే షూటింగ్ని నిలిపివేసి వెంకటేష్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. వెంకటేష్, పాయల్ రాజ్పుత్లపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగా డాన్స్ చేస్తున్న వెంకీ కాలు బెణికింది.
వెంకీ కాలిగాయాన్ని పరీక్షించిన డాక్టర్స్.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు. కాలి మడిమకు దెబ్బ తగలడంతో పరుగెత్తడం, ఫైటింగ్ చేయడం లాంటివి కష్టం అంటున్నారు డాక్టర్స్. దీంతో 'వెంకీ మామ' షూటింగ్కి కొద్దిరోజులు గ్యాప్ వచ్చే అవకాశం వుంది. అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 4 న విడుదల కావాలి. వెంకటేష్ కాలి గాయంతో.. వెంకీ మామ విడుదల పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. 'వెంకీ మామ'లో వెంకటేష్, నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్కు జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగచైతన్యకు జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది.
ఇక గతంలో ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో కనిపిస్తున్నారంటే ఎవరి దిష్టి అయినా తగిలిందేమో అని ఫ్యాన్స్ బాదపడుతున్నారు.
ఇకపోతే ఈ మధ్య వెంకటేష్ తరచు హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకోవడం చూడడానికి చాలా బావుంటుంది. ఇటు ఫ్యాన్స్లో కూడా చాలా ఆనందంగా ఉంటుంది.
దాంతో ఈ సినిమా పై అందరిలోనూ ఆసక్తి అమాంతం పెరిగింది. ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.