బాలీవుడ్ లో సక్సస్ ఫుల్ సిరీస్ హౌస్ ఫుల్ సినిమా. ఈ సినిమా సిరీస్ లన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. అందుకే మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కోసం చిత్ర బృందం ఈ సిరీస్ నుండి నాలుగో భాగంగా హౌస్ ఫుల్ 4 ని రెడీ చేశారు.
అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్, కృతి సనన్,
పూజా హెగ్డే వంటి భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కించారు. గత రెండేళ్ళగా ఫుల్ స్వింగ్ లో ఉన్న
అక్షయ్ కుమార్ సహా బాలీవుడ్ టాప్ స్టార్స్ అందరు నటించడంతో ఈ సినిమా మీద అంతటా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
1419లో .. 2019లో కథ సాగుతుందని ఇంతకముందే చిత్ర బృందం రివీల్ చేశారు. ఆ రెండు కాలాలాకు కనెక్టివిటీ ఉంటుంది. ఇక ఈ సినిమాలో
అక్షయ్ కుమార్ గుండు బాస్ గెటప్ లోనూ కనిపిస్తున్నారు. ఇక ఆసక్తికరంగా పునర్జన్మల నేపథ్యంలో కన్ఫ్యూజన్ కామెడీతో చాలా కొత్తగా దర్శకుడు ఫర్హాద్ సామ్జీ డిజైన్ చేశారు. పునర్జన్మల నేపథ్యం.. అందులోనే కన్ఫ్యూజన్ నుంచి పుట్టుకొచ్చే కామెడీ ఈ సినిమాలో హైలైట్ గా ఉంటుందట. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఈ సినిమాలోని 'బూత్ రాజా' సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ మెగాస్టార్
చిరంజీవి నటించిన 'ఖైదీ నెం. 150' సినిమాలోని 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' తరహాలో సాగుతుంది. హౌస్ ఫుల్ 4 సినిమా ట్రైలర్ విడుదలైన సమయంలోనే మెగా ఫ్యాన్స్ కొందరు ఈ మ్యూజిక్ ను గుర్తు పట్టి సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.
బూత్
రాజా సాంగ్ మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో పాటు వీడియో సాంగ్ విడుదలయిన తర్వాత సినిమాపై జనాల్లో మరింత ఆసక్తిని పెంచింది. అయితే బూత్
రాజా సాంగ్ అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్లు రీసెంట్గా చిత్ర యూనిట్ ఒప్పుకోవడంతో పాటు యూట్యూబ్ లో క్రెడిట్ కూడా ఇచ్చారు. సిగ్నేచర్ మ్యూజిక్ రాక్ స్టార్
దేవిశ్రీ ప్రసాద్ అంటూ పేరు పెట్టడంతో ఇది అమ్మడు లెట్స్ డు కుమ్ముడు నుండి అఫిషియల్ గా ట్యూన్ ని ఉపయోగించుకున్నట్లు చిత్ర బృందం అంగీకరించారు.