ఇక ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. అమెరికాలో స్థిరపడిన ఎన్నారై లకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. అమెరికాలో స్థిరపడటం చూసి చాలా మంది అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసే వారు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడికి వెళ్ళిన చాలా మంది రోడ్డున పడటం ఉద్యోగాలు లేక ఇండియా నుంచి డబ్బులు పంపించడంతో ఆర్ధిక భారం ఇక్కడి వారికి కూడా పెరుగుతుంది. ఎన్నారైలు చాలా మంది ఇండియా వచ్చేయాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనితో పిల్లను ఇవ్వొద్దు అని నిర్ణయం తీసుకున్నారు. ఇక పిల్లలను విదేశాలకు పంపించి చదివించే ప్రయత్నం కూడా చాలా మంది చేయడం లేదు. యూరప్ దేశాల విషయంలో సానుకూలంగానే ఉన్నా సరే ఇతర దేశాల విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అమెరికా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. మరి భవిష్యత్తులో అయినా పరిస్థితి మారుతుందో లేదో చూడాలి. చాలా వరకు కూడా ఇప్పుడు విదేశాలకు వెళ్లి చదవాలి అనే ఆలోచన కూడా చాలా మంది విరమించుకున్నారు. ఇక అక్కడి ప్రభుత్వాలు కూడా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నాయి..