కొన్ని కొన్ని సార్లు చిన్నచిన్న కారణాలే పెద్ద పెద్ద ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా చిన్న విషయాలకే జరిగే అనర్థాల గురించి తెలిసిన తర్వాత ఇది నిజంగానే జరిగిందా లేక పోతే ఇదేమైనా కలా అని ప్రతి ఒక్కరికి అనుమానం కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు వెలుగు  లోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవ లోకి చెందినదే. సాధారణం  గా ప్రతి మనిషి జీవితం లో కొలాయి అనేది ఒక భాగమే. ముఖ్యం గా మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా కొళాయి నీటిని వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన ఘటన మాత్రం నమ్మశక్యం గా అస్సలు ఉండదు.


 చోద్యం కాకపోతే కొళాయి నీళ్లతో ముక్కును కడుక్కోవడం ద్వారా ప్రాణాలు పోవడం జరుగుతుందా.. కానీ ఇక్కడ మాత్రం అదే జరిగింది. ట్యాప్ వాటర్ తో ముక్కు కడుక్కున్న ఒక వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. నీటి లో అమీబా అతని శరీరంలోకి ప్రవేశించి చివరికి ప్రాణం తీసేసింది. అమెరికా లోని సౌత్ ఫ్లోరిడా లో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే అత్యంత అరుదుగా సోకే మెదడు తినే అమీబా నిక్లేరియా పౌలూరి కారణం గానే మరణించాడని వైద్యులు వెల్లడించారు.


 అయితే ఇక ఇది సోకితే దాదాపు మనిషి బ్రతకడం చాలా కష్టం అంటూ డాక్టర్లు కూడా తెలిపారు. కాగా సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు, వంటి మట్టి వెచ్చటి మంచినీటిలో అమీబా నివసిస్తూ ఉంటుందట. ఇక అమీబాతో కలిసితమైన నీరు ముక్కులోకి ప్రవేశించినప్పుడు అది మానవ శరీరంలోకి చేరేందుకు అవకాశం ఉంటుందట. ఇక మెదడుకు చేరి కణజాలాన్ని మొత్తం ప్రభావితం చేసి ప్రాణాలు తీసేస్తుందట. అయితే అమెరికాలో ప్రతి ఏడాది ముగ్గురు ఈ అరుదైన వ్యాధి బారినపడి చనిపోతున్నట్లు రిపోర్టులు కూడా చెబుతూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: