ఇటీవల కాలంలో సభ్య సమాజం తీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మంచి చదువులు చదివి ఒక మంచి ఉద్యోగం సాధించి.. ఇక సభ్య సమాజంలో గౌరవంగా బ్రతకాలి అని అందరూ అనుకునేవారు. కొంతమంది ఏదో ఇక ఒక వ్యాపారం చేస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశపడేవారు. ఇక ఇలా అనుకున్నది సాధించేందుకు ఎంతగానో శ్రమించేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం మనుషుల ఆలోచన తీరు పూర్తిగా మారిపోయింది. ఉద్యోగమో వ్యాపారమో చేసి గౌరవంగా బ్రతకడం కాదు.. మనుషులను మోసం చేసి భారీగా డబ్బులు దండుకోవాలని అనుకుంటున్నారు.


 వెరసి అమాయకపు ప్రజలను టార్గెట్ గా చేసుకొని ఇక మాయమాటలతో ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇలా మోసాలు చేయడంలో కూడా ఒక్కొక్కరు ఒక్కో వెరైటీ చూపిస్తూ ఉన్నారు. దీంతో ఎవరు ఎప్పుడు ఎలా మోసం చేస్తారు అన్న విషయం అర్థం కాక.. జనాలు అందరూ కూడా ఏ పని చేయాలన్నా కాస్త ముందు వెనక ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇలా సభ్య సమాజంలో రోజురోజుకు మోసం చేసే వాళ్ల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఆమె ఒక కోటీశ్వరులు కానీ ఇటీవల ఆమెకు కోర్టు ఏకంగా మరణ శిక్షణ విధించింది.


 వియత్నాంలో ఈ ఘటన జరిగింది. కోటీశ్వరురాలు అంటున్నారు కోర్టు మరణ శిక్ష విధించింది అంటున్నారు. అయితే ఏదో పెద్ద విషయమే జరిగి ఉంటుంది అనుకుంటున్నారు కదా. నిజమే ప్రజల్ని మోసం చేసిన కోటీశ్వరురాలు ట్రువాంగ్ మైలాన్ కు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. 2012 - 2022 మధ్య కాలంలో ఆమె వేలాది నకిలీ సంస్థలు స్థాపించి వాటి ద్వారా లక్షల కోట్లు సంపాదించింది. అయితే ఈ కేసు పై దర్యాప్తు చేసిన హో చిన్ నగరంలోని కోర్టు.. సదరు మహిళకు మరణశిక్ష విధిస్తున్నట్లు ఇటీవల తీర్పునిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: