అభం శుభం తెలియని అమ్మాయిలను మాయ మాటలు చెప్పి మోసాగించడం తోపాటు, వారిపై క్రూరంగా అత్యాచారం చేస్తున్న ఘటనలు మాత్రం మన దేశంలో ఆగడం లేదు. ఇటీవల హైదరాబాద్ లోని షాద్ నగర్ ప్రాంతం లో లేడీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన మరువకముందే అదే హైదరాబాద్ లో మరొక దారుణం నేడు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, 

 

నారాయణ గూడకు చెందిన ఠాకూర్ అమర్ సింగ్ అనే అనే యువకుడు కామాటిపుర కు చెందిన ఒక మైనర్ బాలిక ను మొన్న 11వ తేదీన బాలిక చదువుతున్న కళాశాల వద్దకు వెళ్లి మాయమాటలు చెప్పి ఆమెను నారాయణగూడ లోని తన ఇంటికి తీసుకెళ్లి, తన మామ లఖన్ సింగ్ సాయంతో క్రూరంగా అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆ బాలికను రెండు రోజులుగా అక్కడే బలవంతంగా నిర్బంధించి ఉంచాడు. అయితే కళాశాలకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం స్పెషల్ టీం సాయంత్రం తో గాలింపు చేపట్టారు. 

 

అయితే ఎట్టకేలకు బాలికను నారాయణగూడ ప్రాంతంలోని అమర్ సింగ్ తీసుకెళ్లినట్టు గా గుర్తించిన పోలీసులు, పథకం ప్రకారం అతన్ని మరియు అతని మామని వలపన్ని పట్టుకున్నారు. అనంతరం బాలిక ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ రకమైన ఘటనలకు ఎంత కఠినంగా శిక్షలు విధిస్తున్నప్పటికీ ఇంకా కొందరు మృగాళ్లు మాత్రం ఇంకా ఇటువంటి వాటికి పాల్పడుతూనే ఉన్నారని, కావున యువతులు ఇటువంటి వాటి పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. అలానే నిందితుడికి కఠిన శిక్ష అమలు అయ్యేలా చూస్తాం అని చెప్పడం జరిగింది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: