భూకంపం సంబంచించిన ప్రాంతానికి పహల్గామ్ కు మధ్యన దాదాపుగా 15 కిలోమీటర్ల వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు చలి కాలం కావడం వలన ఆ సమయానికి ఇంకా ప్రజలు నిద్ర లేవలేదు. అందుకే విషయాన్ని తెలుసుకోవడానైకి కాస్త ఆలస్యం అయింది. కానీ అదృష్టవశాత్తూ తీవ్రత ఎక్కువగా లేదు. భూకంప తీవ్రతను చూస్తే రిక్టర్ స్కేల్ పై 3.2 గా మాత్రమే నమోదు అయింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ పర్ సీస్మోలజీ ధ్రువీకరించారు. కాగా.. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ భూప్రకంపనలు వలన ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగలేదు. ఇక్కడ భూకంపం రావడం ఇది మొదటి సారి కాదు. ఈ నెలలో ఇది రెండవసారి కావడం గమనార్హం. ఫిబ్రవరి మొదటి వారంలో అంటే 5 వ తేదీన కాశ్మీర్ లోయ దగ్గరలో భూమి కంపించింది. ఇలా వరుసగా భూకంపం వస్తుండడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరి దీని పట్ల అక్కడి ప్రభుత్వం ఏ విధమైన కేహార్య్లు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.