ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయాక ఈ రెండు రాష్ట్రాల మద్య తలెత్తిన సమస్యలు అంటే మొదటగా చెప్పాల్సింది రాజదాని గురిందే, హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేయడం ఈ లోగా ఏపి రాజదానిని ఏర్పాటు చేసుకోవాలని శివరామకృష్ణ కమిటీని వేసి కొన్ని సూచనలు కూడా చేశారు. ఆ తరువాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు... ఏపి కోసం అమరావతిని రాజదాని గా ఎంపిక చేసి అక్కడ రాజదానికి కావలసిన సకల సౌర్యాల కోసం పనులు మొదలుపెట్టారు అప్పటి ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఏపికి మూడు ఉమ్మడి రాజధానులను ఏర్పాటు చేయాలనే ప్రణాళికను రూపొందించి ఆ దిశగా పనులను మొదలుపెట్టారు.

ఈ విషయం లో అప్పటి నుండి ఇప్పటి వరకు అధికార పార్టీకి ప్రత్యర్ధి పార్టీ టిడిపికి నడుమ రాజదాని యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స టిడిపి పై విమర్శల వర్షం కురిపించారు. 2024 వరకు కూడా  ఏపీకి రాజధాని హైదరాబాద్ నే అంటూ ఆయన వ్యాఖ్యలు చేయగా, టీడీపీ నేతల విమర్శలపై మంత్రి బొత్స మండిపడ్డారు. అచ్చెన్నాయుడిని టార్గెట్ చేస్తూ మనిషి పొడవు అయితే సరిపోదు కాస్త బుర్ర కూడా పెరగాలి అంటూ కామెంట్లు విసిరారు. పైకేమో ఏపి కోసం పాటుపడుతున్నాం అంటారు కానీ హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తూ తమపాటికి తాము ఉంటారు.

కానీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే మాత్రం వ్యతిరేకిస్తారు. ఇది ఎంత వరకు సమంజసం. హైదరాబాద్ లో ఉంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాలన చేశారు. అంతేనా స్వార్దంగా ఆలోచించి దోపిడీ చేయాలనే అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు, పాలనలో పారదర్శకత కనపడలేదు అన్నది వాస్తవం. అయితే చంద్రబాబు అమరావతి విషయంలో చేసింది మాత్రం నూటికి నూరు పాళ్ళు స్వార్ధ రాజకీయమేనని ఘంటాపధంగా బొత్స చెప్పారు. గతంలో చంద్రబాబు ఏపీలో లేకుండానే పాలన చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ఇప్పుడు ప్రగల్భాలు పలకడం మంచిదికాదని చంద్రబాబుకు హితవు పలికారు బొత్స. హై కోర్ట్ చెప్పిన విధంగానే అమరావతి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: