ఉదయం 6 కు తీస్తే ఇక కరెంట్ వచ్చేది మధ్యాహ్నం పైనే, లేదా మధ్యాహ్నం 12 పైన తీస్తే ఇక సాయంత్రం 6 తర్వాతే వస్తోంది. రాజమండ్రి లో అయితే గంటల తరబడి విద్యుత్ కోతలకు తాలలేక జనం నిరసనలు తెలుపుతున్నారు. అక్కడ రాత్రి 9.30 గంటల నుండి విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఇందుకు నిరసనగా రాజమండ్రి జాంపేట విద్యుత్ స్టేషన్ ను చుట్టుముట్టాయి టిడిపి శ్రేణులు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఆందోళన మొదలయ్యింది. ఈ కరెంట్ కోతల నుండి తమని రక్షించి కరెంట్ సరఫరా సరిగా ఉండేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విద్యుత్ కోతలు రోగులను సైతం మరింత ఆందోళన చెందేలా చేస్తున్నాయి.
ఈ కరెంట్ కోతల కారణంగా హాస్పిటల్స్ లో జనరేటర్ సరిగా అందుబాటులో లేక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు కరెంట్ కోతలు గురించి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కరెంట్ ను నిలిపివేస్తూ ఉండటంతో రోజువారీ పనులకు ఆటంకం కలిగి ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు.