2024 వ సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో bjp భవితవ్యంపై రెండు రోజులుగా JDU జోస్యం చెప్తోంది. ఆ పార్టీకి కేవలం 50 సీట్లు మాత్రమే వస్తాయని JDU నేత, సీఎం నితీశ్ కుమార్ శనివారం నాడు అనగా..ఇక తాజాగా JDU జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్ అయితే కేవలం రెండంటే రెండు స్థానాలే వస్తాయని ఆదివారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. ఈ రెండు స్థానాలు బీజేపీ మొదటిసారిగా పోటీ చేసిన 1984 లోక్‭సభ ఎన్నికల్లో వచ్చినవి. వచ్చే ఎన్నికల్లో bjp 1984 వ సంవత్సరానికి వెళ్తుందని JDU ఉద్దేశం. ఇక బిహార్ లో మొత్తం 40 స్థానాలు JDU గెలుచుకుంటుందని ఆయన అనడం గమనార్హం.కొద్ది రోజుల క్రితమే nda కు గుడ్‭బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రి అయిన నితీశ్.. బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అంతేనా.. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే పనుల్లో కూడా ఆయన బిజీ బిజీగా ఉన్నారు. బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ.. బీజేపీని ఎదుర్కోవడం ఆ పార్టీ వల్ల కాదనే విమర్శలు ఉన్నాయి.


నితీశ్ సైతం కాంగ్రెస్ లేకుండా లేదంటే కాంగ్రెస్ నాయకత్వంలో లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నం చేస్తున్నారు.వాస్తవానికి 2020 వ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో bjp - JDU కలిసే పోటీ చేశాయి. అయితే ఆ తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ.. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు నితీశ్‭ను ముఖ్యమంత్రి చేశారు. అయితే సీఎం నితీశే అయినా.. పాలన మాత్రం బీజేపీ హైకమాండ్ చేస్తుందనే విమర్శలు అప్పట్లో బాగానే వినిపించాయి. అంతే కాకుండా పొత్తులో ఉన్నామని చూడకుండా బీజేపీ నేతలు తరుచూ నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం నితీశ్‭కు చాలా తీవ్రమైన కోపాన్ని కలిగించిందట.మరి చూడాలి JDU నేతల జోశ్యం నిజామయ్యి bjp కి మునుపటి గతి పడుతుందో లేదో అనేది. ఏది ఏమైనా ఎన్నికలు జరిగితే కానీ ఏం జరుగుతుందో చెప్పలేము.

మరింత సమాచారం తెలుసుకోండి: