కరోనా సమయంలో కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపించాడని నిజామాబాద్ ఎంపీ విమర్శల వర్షం అందుకున్నారు. కరోనా వివరాలను చెప్పకుండా కేటీఆర్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కాలంలో పీఎం కిసాన్ , జనధన్ , ఉజ్వల పథకం , భవన నిర్మాణ కార్మికులకు సాయం, పెన్షన్లు, ఉపాధి హామీ పథకం, ఎస్డీఆర్ఎఫ్, ఆహార భద్రత పథకం కింద మొత్తం ఇచ్చిన నిధుల వివరాలను బండి సంజయ్ వెల్లడించారు. అంతే కాదు.. కరోనా కట్టడి కోసం.. కేంద్రం రూ. 290 కోట్లు ఇస్తే తెలంగాణ సర్కార్ ఆ నిధుల్లోనూ కేవలం రూ. 160 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని లెక్కలు బయట పెట్టారు.