మొదటినుంచి పార్టీ లో కీలక పాత్ర పోషించిన రోజా కి ఈ సారి మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కుతుందని అనుకున్నారు. కానీ కొన్ని సమీకరణాల దృష్ట్యా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు.. ప్రస్తుతం ఆమె నగరి ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటూ ఏ లోటు రానివ్వట్లేదు.. దాంతో ప్రజలు ఆమెకు నీరాజనాలు పలుకుతున్నారు.. దీంతో అక్కడ టీడీపీ నాయకులూ సైతం రోజా పనితనానికి ముగ్దులవుతున్నారట.. టీడీపీ నుంచి పోటీ చేసిన గాలి వారసుడు కూడా నగరి లో ఎక్కువ గా కనిపించకపోవడం రోజా కు కలిసొచ్చే అంశం.. ఇక ఇటీవలే 41 టీడీపీ సానుభూతిపరులైన కుటుంబాలకు ఆర్కే రోజా పార్టీలోకి తీసుకొచ్చారు.