వైసీపీ పార్టీ ఏపీ లొ ప్రజల నమ్మకాన్ని ఏ విధంగా సంపాదించుకుందో అందరికి తెలిసిందే.. గతంలో రాష్ట్రంలో ఏ పార్టీ కి దక్కనంత కీర్తి, గెలుపు ఒక్కసారిగా వైసీపీ కి దక్కాయి.. సీఎం జగన్ కు ప్రజాభిమానం కూడా ఈ ఎన్నికల్లో ఎక్కువగా పెరిగింది.. దీనికి కారణం టీడీపీ పట్ల ఉన్న అసహనం అంటే పొరపాటే ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా చాలావరకు వైసీపీ కి అభిమానులు ఉన్నారు. కానీ రాష్ట్రం అభివృద్ధి దృష్ట్యా అనుభవం ఉన్న చంద్రబాబు కు మొగ్గు చూపారు తప్పా అప్పుడే వైసీపీ గెలిచి ఉండేది.. ఏదైతేనేం ప్రజలు ఒకసారి నమ్మి టీడీపీ ని మరోసారి నమ్మకుండా తప్పు చేయలేదు..వైసీపీ ని గెలిపించి మంచి పని చేశారు..