ఇప్పటికే తెలంగాణాలో పుంజుకున్న బీజేపీ పార్టీ ఏపీ లో కూడా సోము వీర్రాజు అధ్యక్షతన రోజు రోజు కి కొంత బలపడుతున్న సంగతి తెలిసిందే.. సోము పదవి చేపట్టాక ప్రజల్లోకి బీజేపీ పార్టీ వేగంగా దూసుకెళ్లింది.. ముఖ్యంగా టీడీపీ వీక్ గా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది.. కేంద్రంలో అధికారంలో ఉన్నా అక్కడ సపోర్ట్ సరిగ్గా లేకపోయినా రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్న పార్టీ మాదిరి సోము ఏపీ లో బీజేపీ బలోపేతానికి చాలా చర్యలు చేపట్టి అందులో సక్సెస్ అయ్యాడని చెప్పాలి.. రాష్ట్రంలో గతంలో ఏ బీజేపీ లీడర్ చేయని విధంగా బీజేపీ బలోపేతానికి కృషి చేశారు సోము..