ఇక ఏపీ లో మొన్నటి ఎన్నికల ఫలితాలతో టీడీపీ పార్టీ భవిష్యత్ శూన్యం అని స్పష్టంగా తెలిసిపోతుంది.. ఎందుకంటే చంద్రబాబు తర్వాత పార్టీ ని నడిపించే సరైన నాయకుడు లేడు.. జగన్ కూడా ఇప్పటిలో అధికారంలోంచి దిగేలా కనిపించడం లేదు..దాంతో టీడీపీ తెలంగాణా లోలా ఏపీ లో పూర్తి గా తుడిచిపెట్టుకు పోయినట్లే అని చెప్పాలి.. ఏపీ లో కరోనా మొత్తం తగ్గిపోయే స్థితిలో ఉన్నా, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తిరిగే పరిస్థితి ఉన్నా టీడీపీ పార్టీ నేతలు మాత్రం ఆ సాకుతో గడప దాటకుండా సేవను దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు..సరే నేతలు అంటే ఎదో అనుకుందాం పార్టీ అధినేతలు సైతం ఇంటిపట్టునే ఉంటూ చోద్యం చూస్తుండడం ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది..