ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ ప్రజలపై వేసిన ముద్ర అంతా ఇంతా కాదు..ఇప్పటికి అయన ను ప్రజలు మర్చిపోలేదంటే అది అయన ప్రజలకోసం చేసిన సేవ అలాంటిది.. విద్య వైద్య రంగాల్లో అయన చేసిన సేవకి , ప్రజలకోసం చేసిన మేలు కి ఆయనకు ప్రజలు తమ గుండెల్లో గుడి కట్టారని చెప్పొచ్చు.. ఎంత వత్తిడి లో ఉన్నా ఎలా నెగ్గాలో జగన్ నుంచి అందరు నేర్చుకోవాల్సిన విషయం.ఇక ఓ ఎనిమిది సంవత్సరాల ముందు జగన్ పరిస్థితి ఎలా ఉన్నది అనేది అందరికి తెలిసిందే.. ఓ వైపు తండ్రి మరణం, మరి వైపు కేసులు, ఇంకో వైపు అప్పుడే పుట్టిన పార్టీ భాధ్యతలు ఇవన్ని జగన్ కి ఒకేసారి ముంచుకు రావడంతో అయన ఎలా తట్టుకుని నిలబడతారో అని అందరు అనుకున్నారు.. కానీ జగన్ వాటిని అధిగమించి ఇప్పుడు ముఖ్యమంత్రి గా ఎదిగారు.. తనపై వచ్చిన ఆరోపణలను ప్రజలకు నిరూపిస్తే చాలు అని ప్రజల్లోకి వెళ్లి మరీ తనని తాను కాపాడుతున్నాడు..