తెలంగాణ లో అసలు సిసలు రాజకీయం ఇప్పుడే మొదలవుతుంది అని చెప్పొచ్చు..ఇన్నాళ్లు టీ ఆర్ ఎస్ పార్టీ ఆధిపత్యంతో ఏ పార్టీ కూడా ప్రజలోకి వెళ్లలేకపోయింది.. ప్రజలకు గులాబీ పార్టీ మీద ఉన్న నమ్మకమో, లేదా కేసీఆర్ పై ఉన్న నమ్మకమో తెలీదు కానీ ప్రజలు కేసీఆర్ ని తప్పా ఎవరిని నమ్మలేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని సైతం పక్కన పెట్టి కేసీఆర్ వైపు మొగ్గారు ప్రజలు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది.. రెండో సారి ఎన్నికల్లో గెలిచినా తర్వాత ఎందుకో కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వచ్చింది అనేకంటే ప్రతిపక్షాలు అలాంటి అలాంటి వాతావరణాన్ని సృష్టించాయి అని చెప్పాలి..కేసీఆర్ పై లేని అపనమ్మకాన్ని ప్రజల్లో తేవడంలో ప్రతిపక్షాలు సఫలమయ్యాయి.. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఇందులో ముఖ్య పాత్ర పోషించింది.