తెలంగాణ రాష్ట్రంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కేసీఆర్ కి దుబ్బాక ఉప ఎన్నిక బ్రేక్ వేసింది.. అంతేకాదు దుబ్బాక లో బీజేపీ విజయం చాలా ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు అయ్యింది.. ఇక్కడ బీజేపీ అనూహ్యంగా విజయం సాధించి టీ ఆర్ ఎస్ కి పెద్ద షాక్ ఇచ్చింది. తెలంగాణ లోప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ లో పస లేని వేళా, అధికార పార్టీ కి ఎదురెళ్లి నిలిచే పార్టీ లేని వేళా, ప్రజలు టీ ఆర్ ఎస్ కి కాకుండా ఎవరికీ ఓటు వేయాలి అని సందిగ్ధం నెల కొన్న వేళా బీజేపీ పార్టీ గెలిచి వీటన్నికి సమాధానం గా నిలిచింది.. ముందు నుంచి ఇక్కడ గులాబీ పార్టీ దే విజయం అనుకున్నారు అంతా కానీ ఎప్పుడైతే రఘు నందన్ రెడ్డి ని టీ ఆర్ ఎస్ పార్ట్ హైలైట్ చేసిందో అప్పుడే ప్రజలోకి అయన మరింత దూసుకుపోయారు.. అంతేకాదు మూడో సారి కూడా అదే నేత నిలబడడంతో ఆయనకు సింపతీ కూడా వర్క్ అవుట్ అయ్యింది.