ఎలాంటి రాజకీయ బలం లేని వేళా ఒంటరిగా ప్రజల అండతో జగన్ పార్టీ పెట్టి ప్రజల్లోకి దూసుకుపోయారు.. అయితే మొదటి ఎన్నికల్లో జగన్ గెలవలేకపోయినా రెండు సారి సారి మాత్రం అత్యధిక మెజారిటీ తో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.. అయితే రాష్ట్రం విడిపోయి అయోమయంలో ఉన్న ప్రజలు అనుభవం ఉన్న చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు తప్పా జగన్ పై అపనమ్మకం కాదు.. జగన్ ఇంత స్థాయి కి రావడానికి అయన ఒక్కరి కృషి ఉందంటే ఎవరు ఒప్పుకోరు.. ఎందుకంటే అయన గెలవడానికి ముఖ్య కారణం ప్రజలు అయితే ప్రధాన కారణం అయన వెన్నంటి ఉన్న కొంతమంది నేతలు, కార్యకర్తలు..