దేశంలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది.. బీజేపీ పార్టీ ఈ ఎన్నికలకు సై అంటుండగా అధికారంలో ఉన్న పార్టీ లు ఈ జమిలీ ఎన్నికలకు ఏమాత్రం సహకరించరు అన్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ జమిలీ ఎన్నికల భయం అయితే పాలకవర్గాలకు పట్టుకుందని చెప్పొచ్చు.. తెలంగాణ లో కేసీఆర్ కి ఇది పెద్ద అగ్ని పరీక్షగా మారబోతుంది.. ఒకవేళ జమిలీ కనుక వస్తే కేసీఆర్ ఎలా దాన్ని జయిస్తాడో చూడాలి . జగన్ కి కూడా ఇది కష్ట కాలాన్ని తెచ్చుపెడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా జమిలీ ఎన్నికలకు తాము సిద్ధమే అని స్పష్టం చేసింది..