దేశంలో ది బెస్ట్ పీఎం గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రధాని మోడీ పై ప్రస్తుతం విమర్శల వర్షం కురుస్తుంది. దేశంలో ఎప్పటినుంచో ఉన్న సమస్యలను పరిష్కరించి దేశంలో పెద్ద హీరో అయిపోయిన మోడీ ఇప్పుడు జీరో గా మారిపోయాడు. రైతు ల ఉద్యమం తో మోడీ పై ఒక్కసారిగా ప్రెషర్ రావడంతో పాటు రైతుల్లో ఉన్న పేరును కూడా చెడగొట్టుకున్నంత పనయ్యింది. ఆర్టికల్ 370 , అయోధ్య రామ మందిరం నిర్మాణం వంటి విషయాల్లో దేశంలోని ప్రజలు మోడీ తెగ పొగిడేశారు. అయితే సరిగ్గా సంవత్సరం గడవక ముందే మోడీ ఇప్పుడు అందరికి విలన్ గా కనిపిస్తున్నారు.. ముఖ్యంగా రైతుల పాలిట దెయ్యంగా మోడీ ని అభివర్ణిస్తున్నారు..