తెలంగాణ లో బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిపోయింది.. కాంగ్రెస్ పార్టీ ని వెనక్కి నెట్టేసి తెరాస పార్టీ ని విమర్శించే పనిలో ఆరితేరిపోయింది. మొన్నటివరకు గులాబీ రంగు ఆధిపత్యం చుసిన వారి ఇప్పుడు కాషాయ ప్రభంజనాన్ని గమనిస్తూనే ఉన్నారు. ఒక్క సంవత్సరంలో ఇంతటి మార్పును బహుశా ప్రజలు కూడా ఊహించి ఉండరు. బీజేపీ పార్టీ అనూహ్యమైన ఎదుగుదలకు పార్టీ కష్టం చాల ఉందని చెప్పాలి. ముఖ్యంగా బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాక పార్టీ ఓ రేంజ్ లో దూసుకుపోతుందని చెప్పొచ్చు. అయన అధ్యక్షుడు అయ్యాకనే సామాన్యుడికి కూడా బీజేపీ పార్టీ అంటే ఏంటో తెలిసింది. గతంలోని ఏ అధ్యక్షుడు తెలంగాణ లో పార్టీ ని ఈ రేంజ్ లో ముందుకు తీసుకెళ్లలేదు.