గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఇప్పటికీ చంద్రబాబు మింగుడు పడట్లేదని ఇటీవలే అయన చేసిన వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి.. అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు రెండుళ్లు కావొస్తుంది. ఆ ఎన్నికల్లో ప్రజలు టీడీపీ ని తరిమి కొట్టి వైసీపీ ని ఏరికోరి మరీ గద్దె ఎక్కించారు.. మొత్తం 175 సీట్లకు గాను 151 సీట్లు వైసీపీ కి కట్టబెట్టి అధికారం జగనప్పగించారు. ఈ తీర్పు తో అప్పుడు బ్లాంక్ అయిన చంద్రబాబు మైండ్ ఇప్పటివరకు కోలుకోలేదు. ప్రజలు తనను ఎందుకు ఆదరించలేదు అని ఇప్పటికీ జుట్టు పీక్కుంటు ఆలోచిస్తున్నాడు..