ఈ మద్య మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతు న్నాయి. కామాంధులు చిన్నారులను సైతం విడవడం లేదు.. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో మహిళలపై అత్యాచార కేసులు పెరిగిపోతున్నాయి.  ఆ మద్య దిశ కేసులో నలుగురు నింధితుల ఎన్ కౌంటర్ జరిగినప్పటీకీ మరికొన్ని కేసుల్లో నింధితులకు ఉరిశిక్ష పడ్డ విషయం తెలిసినా.. కామాంధులు ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నారు.  దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న అత్యాచారాల విషయంలో ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. ఈ అత్యాచారాల పర్వం ఎక్కడా తగ్గడం లేదు తాజాగా ఓ బాద్యతగల నేత బిజెపి మాజీ ఎమ్మెల్యే ఓ మహిళలను అందునా కార్పోరేటర్ ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి దారుణంగా మోసం చేశాడు.   

 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..  ముంబైకి చెందిన మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు మహిళా మున్సిపల్ కార్పొరేటర్ మీరారోడ్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాదు  మహిళా కార్పొరేటర్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాలు కలిసి ఉన్న అభ్యంతరకరమైన ప్రైవేట్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి.  దాంతో తాను మోసపోయానని గ్రహించిన మహిళా కార్పోరేటర్ సదరు ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నరేంద్ర మెహతాపై ఐపీసీ 376(2), 496, 417, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఆ ఎమ్మెల్యే కనిపించకుండా పోయారు.

 

అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగిన నరేంద్ర మెహతా పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత కొంత కాలంగా ఉత్తరాధిన బీజేపీ నేతల వ్యవహారం పై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.  కొంత మంది బీజేపీ నేతలపై అత్యాచారా, హత్య కేసులు సైతం నమోదు అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: