ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు బయటి వారి నుంచి మహిళలకు ఆత్మరక్షణ లేదు అనుకునే వారు కానీ...  ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తుంటే సొంత వారి నుంచి కూడా సొంత ఇంట్లో కూడా మహిళలకు రక్షణ కరువైందని అర్థమవుతుంది. కామంతో కళ్లు మూసుకుపోయి సొంత వారే ఆడపిల్లలపై అతి దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో ఎక్కువగా తెరమీదకు వస్తున్నాయి. ఇక తాజాగా సభ్య సమాజం తలదించుకునే  అవమానియ  ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల మైనర్ బాలుడు సొంత చెల్లిని బంధించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని చెన్నై నగరానికి చెందిన 14 ఏళ్ల బాలిక సమీప స్కూల్ లో చదువుకుంటుంది. అయితే తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి తన స్నేహితులకు వివరించడంతో అసలు విషయం బయటికి వచ్చింది. బాలిక స్నేహితురాలు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక పై కన్నేసిన 15 ఏళ్ల వయసున్న అన్న... సదరు బాలిక పై చాలా సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీని గురించి బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని  అంటూ బెదిరించాడు. దీంతో ఈ విషయాన్ని బాధితురాలు బయట ఎక్కడా చెప్పలేదు. ఇక ఇటీవలే ఈ విషయాన్ని బాధితురాలు తన స్నేహితురాలితో చెప్పడంతో... ఇది అవమానియ ఘటన వెలుగులోకి వచ్చింది. 

 

 

 సొంత అన్నయ్య తన చెల్లి గదిలో కాళ్లు చేతులు కట్టేసి మరీ అనేకసార్లు అత్యాచారం చేశాడు. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలిక వాంగ్మూలం తీసుకున్న పోలీసులు సదరు బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. సదరు బాలుడు పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి... అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కాగా ఇద్దరు పిల్లల తల్లి భర్తతో విడిపోయి విడాకులు తీసుకొని ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకుందని పిల్లలు కూడా ఆమెతోనే ఉంటున్నారని పోలీసులు చెప్పుకొచ్చారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: