తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖైరతాబాద్ లోని వాసవీభవన్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న రాత్రి వాసవీభవన్ లో గది అద్దెకు తీసుకున్న మారుతీరావు అర్ధరాత్రి తరువాత ఆత్మహత్య చేసుకున్నారు. మారుతీరావు భార్య ఒత్తిళ్ల వలనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు చెబుతోంది. 
 
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మారుతీరావు స్వస్థలం. కుతురును ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ ను మారుతీరావు హత్య చేయించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రణయ్ హత్య కేసులో బెయిల్ పై బయట ఉన్నారు. వారం రోజుల క్రితం మారుతీరావు షెడ్డులో ఒక మృతదేహం లభించింది. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మారుతీరావు ఆత్మహత్య గురించి న్యూస్ ఛానెళ్ల ద్వారానే తెలిసిందని ఆయన కూతురు చెబుతున్నారు. 
 
రెండేళ్ల క్రితం తన కూతురు అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ... కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చి ప్రణయ్ ను మారుతీరావు హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రణయ్ హత్య కేసులో మారుతీరావును కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 
 
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణ తరువాత పూర్తి విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మారుతీరావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించనున్నట్టు తెలుస్తోంది. మారుతీరావు మృతదేహం దగ్గర సూసైడ్ నోట్ లభ్యం కాలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక తరువాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. భర్త మృతితో మారుతీరావు భార్య కన్నీరుమున్నీరవుతున్నారు.                      

మరింత సమాచారం తెలుసుకోండి: