ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికీ కరోనా వైరస్ ప్రాణభయంతో వనికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వంద దేశాలకు పైగా ఈ  ప్రాణాంతకమైన విస్తరించింది. ఇక భారతదేశంలోకి కూడా ఈ ప్రాణాంతకమైన వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. దీంతో అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక్కసారిగా అలెర్ట్  అయిపోయాయి. భారత్ లోని చాలా రాష్ట్రాలలో ఈ కరోనా వ్యాపించింది . ఇక రోజురోజుకు భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాణాంతకమైన వైరస్ తో ... ప్రజలందరి చిగురుటాకులా వణికిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ ముఖ్యమంత్రి తో పాటు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కరోనా  వైఎస్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. 

 

 

 కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని... కేవలం ఒక్క పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే చాలు కరోనా  వైరస్ తగ్గుతుంది అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మాస్క్ లు  కూడా ధరించాల్సిన అవసరం లేదని... కేవలం ఒక్క పారాసిట్మల్ టాబ్లెట్ తో కరోనా  తగ్గిపోతుంది అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి... కరోనా  వైరస్ వల్ల భయపడాల్సిన పని లేదని కేవలం 60 సంవత్సరాలకు పైబడిన వారు మాత్రమే కరోనా  వైరస్ బారిన పడతారు అని వ్యాఖ్యానించడం సంచలనం గా మారిపోయింది. 

 

 

 ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా వైరస్ పై  చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ గా మారిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పారాసిట్మల్ అనే అనే హాష్ ట్యాగ్  ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారిపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్ కేవలం ముఖ్యమంత్రులు మాత్రమే కాదని సైంటిస్టులు కూడా అంటూ ట్రోల్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో.

మరింత సమాచారం తెలుసుకోండి: