కరినపై యుద్ధంలో అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు తమ కంటికి కనిపించని శత్రువుతో అలుపెరగకుండా యుద్ధం చేస్తున్నాయి. శత్రువు ఎంత బలంగా ఉన్నా, తమ శక్తికి మించి మరి పోరాడుతున్నాయి. ఏదో రకంగా ఈ మహమ్మారి నుంచి ప్రపంచ మానవాళిని కాపాడుకునేందుకు ప్రజలు ప్రభుత్వం ఉమ్మడిగా కష్ట నష్టాలను ఎదుర్కొంటూ యుద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కరుణ వైరస్ కు మందు లేకపోవడంతో ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమ మార్గంగా లాక్ డౌన్ ను నిర్వహిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా లాక్ ఎంత కఠినంగా అమలు చేస్తున్నా కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే తెలంగాణలో మాత్రం కెసిఆర్ ముందుచూపుతో అక్కడ పరిస్థితి కాస్త మిగతా రాష్ట్రాల కంటే అదుపులోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీని కోసం కేసీఆర్ ఎక్కువగా టెన్షన్ పడకపోయినా ... ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేయడం, రాబోయే విపత్తును ముందుగానే గ్రహించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి అదుపులో ఉన్నట్లు కనిపిస్తోంది.
కరోనా వైరస్ నియంత్రించడం దేశంలోని ముఖ్యమంత్రులు అందరికీ పెద్ద ఛాలెంజ్ గా ఉన్నా... తెలంగాణ సీఎం కేసీఆర్ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు కరోనా వైరస్ విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే వ్యాపిస్తుందని గ్రహించిన కెసిఆర్ వైరస్ ప్రమాదాన్ని గుర్తించిన తర్వాత విదేశాల నుంచి తెలంగాణకు ఎంత మంది వచ్చారు అనే వివరాలను తెప్పించుకున్నారు. అలా వచ్చిన వారందరినీ క్వారంటైన్ చేసారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో పాజిటివ్ వచ్చిన వారికి స్పెషల్ వార్డుల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు. మిగతా వారిని ఇంట్లోనే ఉంచి వారికి రెండు విడతలుగా కరోనా పరీక్షలు నిర్వహించి వారికి ఆ వ్యాధి సోకి లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత విడతల వారీగా విడుదల చేశారు. అలాగే కరోనా సోకిన వారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి జాగ్రత్తలు తీసుకోవడంతో చాలామంది ఆ వైరస్ ముప్పు నుంచి బయట పడ్డారు.
నిన్ననే తెలంగాణలో గాంధీ ఆస్పత్రి నుంచి 15 మంది కరోనా వైరస్ బాధితులకు పూర్తిగా నయం కావడం తో వారిని వారి వారి స్వస్థలాలకు పంపించారు. ఈ విషయంలో గాంధీ ఆసుపత్రి వైద్యుల తో పాటు, తెలంగాణ సీఎం కేసీఆర్ గైడ్లైన్స్ కూడా బాగా పని చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూసుకుంటే మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలోని కరోనా వైరస్ ను అదుపులోకి తీసుకు వచ్చే చర్యలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో మొత్తం క్రెడిట్ ఎంత తెలంగాణ సీఎం కేసీఆర్ కి దక్కుతుంది. ఇప్పుడు ఆయనను చూసి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెసిఆర్ చర్యలతో ఇప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రం ఊపిరి పీల్చు కుంటుంది. మరికొద్ది రోజుల్లోనే తెలంగాణకు కరోనా నుంచి విముక్తి కల్పించే విధంగా కెసిఆర్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.