ఏపీలో కరోనా కేసులు శర వేగంగా పెరుగుతున్నాయి. రోజూ 60 నుంచి 80 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. మూడు నాలుగు రోజుల నుంచి ఇదే పరిస్థితి. అందులోనూ పొరుగున ఉన్న తెలంగాణలో కేసులు గణనీయంగా తగ్గుతుంటే.. ఏపీలో మాత్రం జోరు పెరిగింది. అయితే.. కరోనా వైరస్ వ్యాప్తికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్లీపర్ సెల్స్ లా వ్యవహారిస్తున్నారా..? ఏపీలో కరోనా పెరిగేందుకు టీడీపీ కృషి చేస్తోందా..?

 

 

అవునంటున్నారు ఏపీ రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకట రమణ. ఏపీలో కరోనా వ్యాప్తికి టీడీపీ కార్యకర్తలే వ్యాప్తికి కుట్ర పన్నారాన్న ఆనుమానాలు కలుగుతున్నాయని మంత్రి మోపిదేవి వెంకట రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా పై ప్రభుత్వం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత అన్నింటీనీ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. ప్రచారం కోసమే చంద్రబాబు ఆర్బాటం అంతా అని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు.

 

 

ఏపీ ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలను ఆదుకోవటంలో చంద్రబాబు ఎందుకు సహకరించటం లేదని మంత్రి మోపిదేవి వెంకట రమణ విమర్శించారు. కరోనాను టీడీపీ,వైసీపీ సమస్యగానే చూడొద్దని మంత్రి అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబట్టే అక్కడ వైరస్ సోకిందంటూ ఆరోపించటం దారుణమని మంత్రి మండిపడ్డారు.

 

 

కరోనా కిట్ల వ్యవహారంలో పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసిన ధరకే మనకూ సరఫరా చేయాలని సదరు కంపెనీకి ముందే స్పష్టం చేశామన్నారు. రాజధాని కోసం రైతులు, ప్రజల నుంచి జోల పట్టిన నిధులు ఏమయ్యాయని మంత్రి మోపిదేవి విమర్శించారు. టీడీపీ హయాంలోనూ నిధులు పక్కదారి పట్టించారని మంత్రి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: