భారతదేశం మొత్తం కరోనా  పై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు కఠిన నిబంధనల అమలు చేస్తూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను  ఇంటికే పరిమితం చేసి కరోనా వైరస్ ను తరిమి కొట్టడానికి అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి. అయితే ఈ పోరాటంలో భాగంగా ప్రజలను ఇంటికే పరిమితం చేసి వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్  అమలు అవుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్  కారణంగా ఎక్కడి రవాణా వ్యవస్థ అక్కడే నిలిచిపోయింది... కంపెనీలన్నీ మూతపడ్డాయి... ఉద్యోగులు వ్యాపారులు అనే తేడా లేకుండా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో అన్ని రంగాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 

 

 

 ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే...  ఇక ఇప్పుడు లాక్ డౌన్   సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత దిగజారి పోతుంది అనే చెప్పాలి. అన్ని రంగాలు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి . అటు స్టాక్ మార్కెట్లో కూడా.. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. అటు ప్రజల పరిస్థితి అయితే రోజుకు అధ్వానంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ అవి పూర్తి స్థాయిలో ప్రజా  అవసరాలనుమాత్రం తీర్చడం లేదు. 

 

 

 అయితే తాజాగా దేశంలో నెలకొన్న సంక్షోభం పై ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దేశం  లోని పేదలను ఆదుకోవాలి అంటే కేంద్రానికి ఏకంగా 65 వేల కోట్ల నిధులు కావాలి అంటూ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేశం నుండి పూర్తిగా కరోనా వైరస్ పారదోలడం గాని లేదా కరోనా వైరస్ కేసుల సంఖ్య జీరో చేయడం కానీ ఇప్పట్లో జరిగే పని కాదు అంటూ వ్యాఖ్యానించారు. అయితే సామాజిక దూరాన్ని  దేశ ప్రజలందరికీ అలవాటు చేస్తే భవిష్యత్తులో కూడా ఎంతో మంచిది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓవైపు కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతునే... మరోవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూడా చర్యలు చేపట్టడమే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ముందున్న సవాలు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: