భారతదేశంలో ఒక వైపు కరోనా మితిమీరుతుంటే మరోవైపు దేశంలో దారుణాలు కూడా రోజురోజుకు పెరుగుతూ వెళ్తున్నాయి. మూడవ లాక్ డౌన్ ముగిసేవరకు ఘోరాలు నేరాలు కాస్త అదుపులో ఉన్న సడలింపులు తర్వాత మళ్లీ కాస్త ఎక్కువ అయ్యాయని చెప్పవచ్చు. 


ఇక అసలు విషయంలోకి వెళ్తే... తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. జిల్లాలోని తిప్పర్తి మండలంలో ఉన్న ఎర్రగడ్డ గూడెం గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికను కొందరు వ్యక్తులు తీసుకొని గత కొద్ది రోజుల నుంచి ఆ అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు. అయితే ఈ సంఘటన కాస్త ఆలస్యంగా గురువారంనాడు వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన బత్తుల శంకర్, అనిల్, రమేష్, నవీన్ అనే యువకులు ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి ఆ అమ్మాయిపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు.

 

ఇక ఈ విషయంపై బయట ఎవరికైనా చెబితే తనని చంపేస్తామని బెదిరించారు అంటుంది ఆ బాలిక. దీంతో ఆ బాలిక మౌనంగా ఉండిపోవడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులు తన కూతురి ప్రవర్తనలో మార్పు కనిపించడంతో తల్లిదండ్రులు ఆమెను గట్టిగా అడగగా అసలు విషయం మొత్తం పూసగుచ్చినట్టు చెప్పింది. దీనితో వైద్య పరీక్షలు చేయడంతో ఆ బాలిక గర్భం దాల్చిందని విషయం తెలిసింది. దీనితో ఆ విషయం పై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా ఆ నిందితులపై పోలీసులు నిర్భయ చట్టం కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు సేకరించి కేసును దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు. అయితే ఈ సంఘటన వెలుగులోకి రావడంతో గ్రామ పెద్దలు రంగంలోకి దిగి రాజి చేసేందుకు ప్రయత్నాలు చేశారట. దీనితో వారి మంతనాలు ఫలించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: